Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాగర్ శైలేష్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం 'రహస్యం'. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకులు రామ్గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, 'రామసత్యనారాయణ 14ఏండ్లుగా తెలుసు. చిన్న సినిమాలు తీసి విజయవంతం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దర్శకుడు సినిమాను చాలా స్టయిలీష్గా తెరకెక్కించారు. ట్రైలర్ బాగా నచ్చింది. దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంది. టీమ్కి నా అభినందనలు' అని అన్నారు. ఆర్జీవీ చెబుతూ, 'కొత్త దర్శకుల ప్రతిభను వెలికి తీసిన మా రామసత్యనారాయణకి, దర్శకుడికి అభినందనలు' అని చెప్పారు. 'నూతన దర్శకులకు మార్గదర్శి రామ్గోపాల్ వర్మ. ప్రతి కొత్త దర్శకుడు, ఆర్జీవీ చేతుల మీదుగా తమ సినిమాలను ఓపెన్ చేయించాలని కోరుకుంటారు. ఈ చిత్ర దర్శకుడు సాగర్ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ సినిమా తీశాడు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నాం' అని నిర్మాత తెలిపారు. 'రామసత్యనారాయణ నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారు. ఆర్జీవీ, పూరీ చేతుల మీదుగా మా చిత్ర ట్రైలర్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఆర్జీవీని కలవడం నా జీవిత ఆశయం. ఇన్నాళ్ళకు తీరింది' అని దర్శకుడు తెలిపారు.