Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోహీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సందర్భంగా విడుదలైన సినిమా బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సోమవారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'ఇండిస్టీలో కాంబినేషన్లతో సినిమాలు చేయాలనుకునే దర్శకులే ఎక్కువగా ఉంటారు. కానీ దిల్రాజు అలా కాదు. స్క్రిప్ట్ని నమ్ముకుని సినిమాలు తీసే అతి తక్కువ మంది నిర్మాతల్లో దిల్రాజు ఒకరు. ఆయనంటే నాకు అభిమానం. తాను అమెరికాలో ఉన్నాడు. ఈ సక్సెస్ మీట్కి నన్ను వెళ్ళమంటే మరో మాట లేకుండా వచ్చేశా. దర్శకుడు త్రినాథరావు సినిమాలో రామ్ను సెటిల్డ్గా చేయించాడు. సినిమా చాలా బాగుంది. మరింత పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు.
'ఈ దసరాకు ఇంత పెద్ద సక్సెస్ను అందించిన ఆడియెన్స్కు థ్యాంక్స్. చాలా మంది ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. దిల్రాజు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సాయికృష్ణ స్క్రీన్ప్లే స్పెషలిస్ట్. ప్రసన్న మాటలకు బాగా ఇంప్రెస్ అయ్యాను. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ చాలా బాగా వచ్చింది. చంద్రబోస్, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. విజరు చక్రవర్తి అందమైన విజువల్స్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ కష్టమైనా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. త్రినాథరావు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్' అని హీరో రామ్ చెప్పారు.
దర్శకుడు త్రినాథరావు చెబుతూ, 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమ కోసమే' మూడు చిత్రాలు విజయం సాధించాయి. ఓ దర్శకుడిగా ఇంత కంటే ఏం కావాలి' అని అన్నారు. 'అల్లు అరవింద్ మాకు గాడ్ఫాదర్ లాంటివారు. నా కెరీర్ ఆయన దగ్గరే ప్రారంభమైంది. ఈ దసరాకి మంచి హిట్ రావడం, ఆయన ఈ ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది' అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు.