Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షారూఖ్ ఖాన్ ప్రస్తుతం 'జీరో' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత రాకేష్ శర్మ బయోపిక్లో నటించనున్నారు. అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. ఆయన జీవితం ఆధారంగా నిర్మాత సిద్ధార్థ్ రారు కపూర్
ఓ బయోపిక్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి తొలుత 'సెల్యూట్' అనే టైటిల్ని నిర్ణయించారు. అయితే తాజాగా ఈ టైటిల్ను మార్చినట్టు సమాచారం. 'సారే జహా సే అచ్చా' అనే టైటిల్ను చిత్ర బృందం పరిశీలిస్తోందట. అన్ని కుదిరితే ఈ బయోపిక్ ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. కథానాయికగా భూమి పడ్కేకర్ నటించనున్న ఈ చిత్రానికి మహేష్ మథాయి దర్శకత్వం వహించనున్నారు. ఇక షారూఖ్ ప్రస్తుతం నటిస్తున్న 'జీరో' చిత్రానికి ఆనంద్ ఎల్ రారు దర్శకత్వం వహిస్తుండగా, కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనుండటం ఓ విశేషమైతే, సల్మాన్ గెస్ట్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మరో వివేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.