Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోహీరోయిన్లు గాయకులుగా మారడం కొత్తేమి కాదు. తమ సినిమాల్లోనో, ఇతర చిత్రాల్లోనూ పాటలు పాడుతూ సినిమాకి క్రేజ్ తీసుకొస్తుంటారు. అదే మాదిరిగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా గాయనిగా మారబోతుంది. కాకపోతే సినిమాల్లో కాదు, ఆల్బమ్లో. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మాజా కంపెనీకి చెందిన క్యాంపెయిన్ కోసం జింగిల్ను రూపొందిస్తున్నారు.
ఇందులో రకుల్ పాట పాడబోతుందట. ఆమెతోపాటు అదితి రావు హైదరీ కూడా పాట పాడనుందట. అంతేకాదు ఇందులో డాన్స్ కూడా చేయననున్నారట.
ఏ.ఆర్.రెహ్మాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి పనిచేయడాన్ని రకుల్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతోందట.
'జింగిల్ కోసం తీసిన వీడియో మొత్తం చాలా ఫన్నీగా సాగింది. రెహ్మాన్ సార్ ట్యూన్కి మేం డాన్స్ చేయడం సరదాగా అద్భుతంగా అనిపించింది' అని రకుల్ తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్లో
'దే దే ప్యార్ దే' చిత్రంలో నటిస్తున్న ఆమె తాజాగా మరో ఛాన్స్ను అందుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్ముఖ్ హీరోలుగా రూపొందుతున్న 'మర్జావా' చిత్రంలో కథానాయికగా ఎంపికైంది.