Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సైన్స్ఫిక్షన్ నేపథ్యంలో సూపర్ నేచురల్ అంశాలతో కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం 'టాక్సీవాలా'. గతంలో రాని కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్కు సరికొత్త అనుభూతినిస్తుంది' అని అటున్నారు నిర్మాత ఎస్.కె.ఎన్. విజరు దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ పతాకాలపై ఎస్.కె.ఎన్ నిర్మించారు. నేడు(శనివారం) సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, 'యు.వి, జీఏ 2 వంటి పెద్ద కాంబినేషన్లో సైన్స్ ఫిక్షన్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించాం. ఇప్పటి వరకు రాని ఓ కొత్త పాయింట్తో దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ పాయింట్ నాకు, అరవింద్, బన్నీకి బాగా నచ్చింది. మనం ఎప్పుడూ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తుంటాయని అనుకుంటుంటాం. మన దగ్గర కూడా ఇటీవల కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. అందులో ఇదొకటవుతుంది. విజరు దేవరకొండ డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారని అభిమానులు ఆనందిస్తారు. ఈ వీకెండ్లో అంతా కలిసి ఎంజారు చేసేలా సినిమా ఉంటుంది. తెలుగమ్మాయి ప్రియాంక ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతుంది. మాళవిక నాయర్ ఇప్పటికే నిరూపించుకుంది. జేక్స్ బేజారు అందించిన పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా హైదరాబాద్లో దాదాపు 126 స్క్రీన్లో ప్రదర్శితం కానుంది. ఇటీవల లీకైన పైరసీలో అంతా మూకీగా ఉంది. ఇప్పుడు సినిమా బ్యూటిఫుల్గా వచ్చింది. పైరసీ చూసిన వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బాగా ఎంజారు చేస్తారు. దీంతోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, మెగా ఫ్యాన్స్ అంతా టికెట్ కొని సినిమా చూడబోతున్నట్టు స్క్రీన్షాట్స్ పెట్టడం ఆనందాన్నిస్తుంది. సినిమా అనేది ఎంతో మంది కష్టం. ప్రతి ఒక్కరు టికెట్ కొని థియేటర్లోనే చూడండి' అని అన్నారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం. అన్ని వర్గాలను అలరిస్తుంది' అని కథానాయికలు మాళవిక నాయర్, ప్రియాంక జవాల్కర్ చెప్పారు.