Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్ యాక్షన్ సినిమాలతోపాటు
మధ్య మధ్యలో విభిన్న కథా చిత్రాల్లోనూ నటిస్తూ వైవిధ్యమైన నటుడిగా అజిత్ మంచి పేరు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో తన అభిమానులను, నవ్య కథా చిత్రాలతో తనలోని నటుడిని సంతృప్తి పరుస్తున్నారు. తాజాగా ఆయన
ఓ విభిన్న కథా చిత్రంలో నటించబోతున్నారు. బాలీవుడ్లో విజయం సాధించిన 'పింక్' రీమేక్లో నటించనున్నారు.
బోనీ కపూర్ నిర్మించబోయే
ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్టు సమాచారం. దీనిపై ఇటీవల అజిత్, బోనీ కపూర్ చెన్నైలో కలిశారని తెలుస్తోంది. 'పింక్' చిత్ర కథలో భారీ మార్పులు చేశారని, అజిత్ మార్క్ ఎలిమెంట్స్ను జోడించినట్టు తెలుస్తుంది. 'ఖాకి' ఫేమ్ హెచ్.వినోద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. 2016లో అనిరుద్దా రారు చౌదరీ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామా, సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హారి, ఆండ్రియా, అంగద్ బేడీ ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తమ సామాజిక చిత్రంగా ఇది జాతీయ అవార్డుని కైవసం చేసుకుంది. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తమిళంలో అజిత్ చేయనున్నారట. అజిత్ ప్రస్తుతం 'విశ్వాసం' చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న నాల్గవ చిత్రమిది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.