Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. త్వరలో చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది.'ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ని మార్కెట్లోకి నేరుగా విడుదల చేశాం. ఈ నెల 14న చిత్ర ట్రైలర్ను విడుదల చేయబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. నేపాల్, హైదరాబాద్, కోల్కత్తాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను దర్శకుడు హను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఆడియెన్స్ను మెస్మరైజ్ చేసే చిత్రమవుతుంది. మురళీశర్మ, సునీల్ కీలక పాత్రలో మెప్పిస్తారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఈ నెల 21న గ్రాండ్గా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం'. అని చిత్ర యూనిట్ చెప్పింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జేకే, ఎడిటర్: శ్రీకర్ప్రసాద్.