Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ఇది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బికే ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకాలపై బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయుడు' రెండు భాగాలుగా విడుదల కానుంది. విద్యాబాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓ పాట విడుదల కాగా, ఈ నెల 12న మరో పాటను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇటీవల విడులైన 'కథానాయకా.. ' అంటూసాగే టైటిల్ సాంగ్కు విశేషమైన స్పందన లభించింది. ఈ బుధవారం సినిమాలోని 'రాజర్షి' అంటూ సాగే రెండో పాటను ఉదయం 10.31గంటలకు విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలన్ని ఈ నెలలోనే వరుసగా విడుదల చేస్తాం. సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్ కానుంది' అని తెలిపింది.