Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాజ్ అశ్విన్, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోహీరోయిన్లుగా ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో థౌజండ్ లైట్స్ మీడియా ప్రై.లి పతాకంపై కె.ఎల్.ఎన్.రాజు నిర్మించిన చిత్రం 'అనగనగా ఓ ప్రేమ కథ'. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ, 'కూతురు తప్పుదారిలో పోతుందని తెలుసుకుని ఆమెను సరైన దారిలో పెట్టేందుకు ఓ తండ్రి ఏం చేశాడు?, ప్రేమ విషయంలో తల్లిదండ్రులు, పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు?, ఈ క్రమంలో వచ్చే ట్రాజెడీ ఎలా ఉంటుందనే ఆసక్తికర అంశాలకు ప్రతిబింబమే ఈ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనా చాలా బాగా నటించారు. టెక్నీకల్గా సినిమా చాలా బాగుందని చూసిన సినీ పెద్దలు ప్రశంసించారు. కామెడీ బాగుంటుంది. దర్శకుడు ప్రతాప్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా నచ్చి గీతా ఆర్ట్స్ వాళ్ళు గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అందుకు చాలా హ్యాపీ. కంప్లీట్ ప్యాకేజ్ చిత్రమిది. కచ్చితంగా ఆడియెన్స్ను ఆకట్టుకుంటుంది' అని అన్నారు. 'ఇందులో నేను సూర్య పాత్రలో నటిస్తున్నాను. చాలా ఎనర్జీ, హైపర్ ఉన్న పాత్ర నాది. నా డెబ్యూ సినిమాను ఇంత గ్రాండ్గా నిర్మించిన నిర్మాత కె.ఎల్.ఎన్ రాజుకి ధన్యవాదాలు. కొత్తవాళ్ళం నటించేటప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో తెలిసిందే. టీమ్ అందుకు చాలా సపోర్ట్ చేసింది. నేను హీరోకి మారడానికి కారణమైన మామయ్య మార్తాండ్ కె.వెంకటేష్కి కృతజ్ఞతలు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది' అని హీరో విరాజ్ తెలిపారు. 'నేను తెలుగులో సైన్ చేసిన తొలి చిత్రమిది. అందుకే నాకిది చాలా స్పెషల్. ఇందులో నేను అనన్య అనే స్వీటెస్ట్ పాత్రలో నటిస్తున్నా. నా పాత్ర బాగా అలరిస్తుంది' అని హీరోయిన్ రిద్ధికుమార్ తెలిపారు.
దర్శకుడు ప్రతాప్ చెబుతూ, 'చిన్న సినిమా తీయడం చాలా కష్టం. అందులో కొత్త వారికి ఛాన్స్ రావడం, దాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. సినిమా పూర్తి కావడం ఓ ఎత్తు, దాన్ని విడుదల చేయడం మరో ఎత్తు. గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేయడం గర్వంగా ఉంది. నిర్మాత రాజుగారు నాకు చాలా ప్రీడమ్ ఇచ్చారు. హీరోహీరోయిన్లు బాగా చేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. ఆర్ ఆర్ హైలైట్గా నిలుస్తుంది. సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా' అని చెప్పారు. 'కె.ఎల్.ఎన్.రాజు తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమిది. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ ప్రాజెక్ట్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రేమ కథలో హీరోహీరోయిన్లు బాగా నటించారు. సినిమా విజయం ఖాయం' అని నటుడు కాశీ విశ్వనాథ్ తెలిపారు. 'ప్రేమకథా చిత్రాలకు సంగీతం ప్రాణం. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. అలా రావడానికి కారణం నిర్మాత కె.ఎల్.ఎన్.రాజుగారే. ఆయనకు హాలీవుడ్ సినిమాలపై మంచి పట్టు ఉంది. కొన్ని సినిమాల్లోని నేపథ్య సంగీతాన్ని రిఫరెన్స్గా చెబుతూ ఈ చిత్రం కోసం మంచి అవుట్ఫుట్ రాబట్టుకున్నారు. సంగీత పరంగానే కాకుండా, నిర్మాణ పరంగా కూడా ఆయన ఎక్కడా రాజీపడలేదు. మాలాంటి కొత్త వాళ్ళను పరిశ్రమకు పరిచయం చేస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందగలననే నమ్మకం ఉంది' అని సంగీత దర్శకుడు కె.సి.అంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రాజు, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, సమర్పకులు సతీష్, సునైనా పాల్గొని సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.