Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకేఒక్కడు' అప్పట్లో ఓ సంచలనం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కి రాజకీయ నేపథ్య చిత్రాల్లో ఓ ట్రెండ్ సృష్టించింది. ఇప్పటికీ అదే తరహా కథాంశంతో అనేక సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని బోల్తా కొట్టాయి. కానీ పొలిటికల్ డ్రామా చిత్రమంటే ఇప్పటికీ 'ఒకే ఒక్కడు' పేరే చెబుతారు. ఇందులో అర్జున్ నటన అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల శృతిహాసన్ నిర్వహిస్తున్న 'హలో సాగా' షోకి శంకర్ గెస్ట్గా వెళ్ళారు. 'ఒక్కే ఒక్కడు' సీక్వెల్ను ఆశించొచ్చా? అని శృతి అడిగిన ప్రశ్నకు శంకర్ స్పందిస్తూ, 'ఈ సీక్వెల్ ఆలోచన లేకపోలేదు. దాని గురించి ఇంకా ఏం అనుకోలేదు' అని తెలిపారు. అయితే రజనీకాంత్, కమల్ హాసన్, విజరు వంటి వారిలో ఎవరితోనైనా ఈ సీక్వెల్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నారట. ఒకవేళ 'ఒకే ఒక్కడు' సీక్వెల్ చేస్తే విజరు యాప్ట్ అని ఆ మధ్య శంకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజరు హీరోగా ఈ సీక్వెల్ ఉండే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ఇటీవల '2.0'తో భారీ విజయాన్ని అందుకున్న శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్తో 'భారతీయుడు 2'ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా, అక్షరు కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.