Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శేఖర్ వర్మ, వివియా, విద్య హీరోహీరోయిన్లుగా సతీష్ రేగెళ్ళని దర్శకుడిగా పరిచయం చేస్తూ గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఎన్.రావు నిర్మిస్తున్న చిత్రం 'నివాసి'. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ టీజర్ను దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ, 'వర్మ తమ్ముడు శేఖర్ వర్మ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్ర టీజర్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి. శేఖర్ వర్మ హీరోగా కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన చిత్రమిది. అందర్ని మెప్పించే చిత్రమవుతుంది. త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా ఉంది' అని సి.కళ్యాణ్ తెలిపారు. దర్శకుడు సతీష్ రేగళ్ళ మాట్లాడుతూ, 'శేఖర్ వర్మ నటించిన 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' సినిమా చూశా. ఆయన చాలా చక్కగా నటించాడు. ఇప్పుడు మా సినిమాలో ఆయనలోని మరో యాంగిల్ని చూపిస్తున్నాం. ఈ సినిమా తర్వాత శేఖర్ సక్సెస్ఫుల్ యాక్టర్ అవుతాడు. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించా. జర్నీ నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని చెప్పారు. 'ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నా' అని శేఖర్ వర్మ తెలిపారు.