Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో కామెడీ ప్రధానంగా రూపొందిన చిత్రం 'డబుల్ ధమాల్'. దీనికి సీక్వెల్గా ప్రస్తుతం 'టోటల్ ధమాల్' తెరకెక్కుతోంది. అజరు దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లివర్, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'జనక్పూర్ ప్రాంతంలో రూ.50 కోట్లకి సంబంధించిన ఓ సీక్రెట్ ఉంద'ని ఓ వ్యక్తి అనడంతో ఆ డబ్బుని కొట్టేయడం కోసం ఎవరికి వారు ప్లాన్ వేసుకుంటుంటారు. అక్కడికి హీరోల బృందం చేరుకునే క్రమంలో పలు మృగాలు ఈ గ్యాంగ్ని వెంటాడడం, 'నేనెంత ఎధవనో వారికి తెలియదు' అని అనిల్ కపూర్ అంటే, 'నాకు తెలుసు' అని మాధురీ దీక్షిత్ అనడం వంటి సన్నివేశాలు కామెడీని పంచుతుంది. ఆద్యంతం హాస్యభరితంగా సాగే ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజరు దేవగన్ ఫిల్మ్స్, మారుతి మల్టీనేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 22న ఈ సినిమా విడుదల కానుంది.