Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం 'మళ్ళీ మళ్ళీ చూశా'. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా, సాయిదేవ రామన్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టీజర్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా ఫ్రెష్గా ఉంది. కంటెంట్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. టీమ్కి ఆల్ ది బెస్ట్. సినిమా విజయం సాధించాలి' అని అన్నారు. 'ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమ కథా చిత్రమిది' అని చిత్ర దర్శకుడు సాయిదేవ రామన్ తెలిపారు. నిర్మాత కోటేశ్వరరావు చెబుతూ, 'మా కంటెంట్ నచ్చి టీజర్ని విడుదల చేసిన సురేష్బాబుకి థ్యాంక్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేస్తాం' అని చెప్పారు. 'కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రేమ కథా చిత్రమిది' అని హీరో అనురాగ్ తెలిపారు. ఈటీవీ ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని, ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటర్: సత్య గిడుతూరి, మాటలు : హేమంత్ కార్తీక్, పాటలు : తిరుపతి జావాన, ఆర్ట్ : సుమిత్ పటేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కొణిదెన కోటేశ్వరరావు.