Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీమంతుడు' సినిమా నుంచి కథల ఎంపికలో మహేష్బాబు ప్రత్యేక పంథా ఫాలో అవుతున్నారు. కమర్షియల్ వ్యాల్యూస్తోపాటు ఓ మంచి సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. 'శ్రీమంతుడు'లో ఊరిని దత్తత తీసుకోవడమనే సందేశాన్ని చెప్పారు. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం'లో కుటుంబ అనుబంధాల విలువ తెలిపారు. 'స్పైడర్'లో తోటివారికి సహాయం చేయాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే విషయాన్ని చెప్పారు. 'భరత్ అనే నేను'లో రాజకీయాల గురించి, జనం కూడా తమ బాధ్యతల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రంలో నటిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో రైతు సమస్యలని చర్చించబోతున్నారట. విదేశాల్లో కార్పొరేట్గా రాణించే మహేష్ తన ఊరికి వచ్చినప్పుడు రైతు సమస్యలకి చలించి, వాటిపై పోరాడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో వినిపించాయి. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే 'మహర్షి' సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమాని తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు గతంలో నిర్మాతలు తెలిపారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో పలు గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్రాజు స్పందించారు. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.