Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'మిఠాయి'. మంగళవారం ఈ చిత్ర టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువగా కంటున్నాడని కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్ళి చేసుకోవాలను కుంటే, ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగని పట్టుకుంటేనే పెళ్ళి జరుగుతుంది. పట్టుకోలేదంటే పెళ్లి జరగదు. అటువంటి సందర్భంలో తన స్నేహితుడు జానీతో కలిసి దొంగని పట్టుకోవడానికి సాయి బయలుదేరుతాడు. ఈ జర్నీలో అతడికి ఎదురైన సమస్యలేంటి? దొంగని సాయి పట్టుకున్నాడా? లేదా అసలు దొంగ ఎవరు? సాయి పెళ్ళి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే' అని అన్నారు. 'ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకి విశేష స్పందన లభించింది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఫిబ్రవరి 22న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం' అని నిర్మాత తెలిపారు.