Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వంత్, పల్లక్ లల్వాని జంటగా సంజరు కార్తీక్ దర్శకత్వంలో విజ్ఞత ఫిల్మ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తున్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని సుమంత్ అశ్విన్, నిర్మాత దామోదర ప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజరు కార్తీక్ మాట్లాడుతూ, 'కుటుంబంతో కలిసి చూసే వినోదాత్మక చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ సినిమా. హీరో విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి కారణమైన నిర్మాత నూతలపాటి మధుకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 22న విడుదల కానున్న సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాం' అని అన్నారు.
'సంజరు కార్తీక్ చాలా రోజులుగా పరిచయం. 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'తో కేరింత పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. భీమ్స్ మంచి బీట్స్ ఉన్న పాటలందించాడు. సుభాష్ కెమెరా వర్క్ చాలా బాగుంది. సంజరు పంచులు వేస్తే పక్కోడి పంచెలు ఊడాల్సిందేలాంటి డైలాగులు రాశారు. తనలో ఎన్ని కష్టాలున్నా, నవ్వుతూనే ఉంటాడు. దర్శకుడిగా తను రూపొందించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి' అని నటుడు రాజీవ్ కనకాల తెలిపారు. 'ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడే కారణం. ఆయనకు పెద్ద బ్రేక్ రావాలి. గతంలో నేను చేసిన 'కేరింత', 'మనమంతా' మంచి సినిమాలు. ఎక్కువగా డ్రామాతో కూడినవి. నేను గతంలో కామెడీ చేయలేదు. కామెడీ చేయడం చాలా కష్టం. అది నాకు ఈజీ అయ్యిందంటే కారణం దర్శకుడే. ఆయన క్రేజీ మ్యాన్. లవ్ చేసి తీస్తే మంచి సినిమా వస్తుంది' అని కథానాయకుడు విశ్వంత్ చెప్పారు.