Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రధారులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిఠాయి'. రెడ్ యాంట్స్ పతాకంపై డా||ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు తరుణ్ పాటల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాహుల్, ప్రియదర్శితో కలిసి ఆడుతూ పాడుతూ 'సైన్మా', 'పెళ్ళిచూపులు' చేశాం. మమ్మల్ని ఆడియెన్స్ ఇంతగా ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. మాకు నచ్చింది చేశాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ టీమ్ నచ్చిన పనిని ఎంజారు చేస్తూ చేశారనే ఫీలింగ్ కలిగింది. నేను నటుడిగా మారలేదు. దర్శకత్వం చేస్తున్నా. అనుకోకుండా ఆఫర్స్ రావడంతో నటించా' అని అన్నారు. 'ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్, నేను క్లాస్ మేట్స్. మాకు సినిమాలంటే ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడినయ్యా. ఈ చిత్రంతో ప్రశాంత్ దర్శకుడయ్యాడు. అతనికిది స్ట్రాంగ్ డెబ్యూ చిత్రమవుతుంది. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్, తను ఫాలో అయ్యే యాక్టర్స్ డిఫరెంట్ లెవల్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనుకుంటున్నా' అని మరో దర్శకుడు క్రాంతి మాధవ్ తెలిపారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ కుమార్ చెబుతూ, 'నా కథపై నమ్మకంతో సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నిర్మించిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్కి థ్యాంక్స్. నా అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా షూటింగ్ స్టార్ట్ చేసేవాడిని. డార్క్ కామెడీ హ్యూమర్ సినిమాలంటే ఇష్టం. ఇది అలానే ఉంటుంది. సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా' అని చెప్పారు.
'ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా భయాలుండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక, అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ ఆయనకు తెలుగు సినిమా ఎంత ప్రేమంటే ఎక్కడెక్కడ్నుంచో డబ్బులు తీసుకొచ్చి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. సెట్లో అంతా ఎంజారు చేస్తూ చేశాం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి మీరూ ఎంజారు చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి పంపే బాధ్యత మాది' అని ప్రియదర్శి తెలిపారు.
నిర్మాత ప్రభాత్ కుమార్ చెబుతూ, 'నేను ఓ డాక్టర్ని. నన్ను నిర్మాతని చేసింది ప్రశాంతే. ఏడాదిన్నరగా తను ఈ సినిమా కోసం కష్టపడ్డాడు' అని చెప్పారు. 'తెలుగులో డార్క్ కామెడీ సినిమాలు వచ్చి చాలా రోజులయ్యింది. ఈ సినిమా బాగా నవ్విస్తుంది. ఇందులో మంచి పాత్ర పోషించా' అని శ్వేతా వర్మ తెలిపింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీ హర్ష, సంగీత దర్శకుడు వివేక్, అదితి మ్యాకల్, షఫీ, కమల్ కామరాజు తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.