Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అర్జున్రెడ్డి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తూ 'వర్మ' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం విదితమే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఔట్పుట్ విషయంలో సంతృప్తి చెందని నిర్మాతలు సినిమా మొత్తాన్ని రీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దర్శకుడు, కథానాయికతో సహా అంతా కొత్తవారితో తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ బనిత సంధుని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. మోడల్ రంగం నుంచి కథానాయికగా మారిన బనిత గతేడాది హిందీలో 'అక్టోబర్' చిత్రంలో నటించింది. 'వర్మ' పాత వెర్షన్లో మేఘా చౌదరి కథానాయికగా నటించగా,
బాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్ని కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఔట్ఫుట్ నచ్చకపోవడంతో నిర్మాతలు మళ్ళీ రీ షూట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.