Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంత కాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే 'విశ్వామిత్ర' సినిమా' అని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'విశ్వామిత్ర'. రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి తిరుమల శెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్, రాజకిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 21న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ, 'వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నా. సృష్టికి, మనిషి ఊహకి ముడిపెడుతూ సినిమా తీశాం. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఈ నెల 21న చిత్ర ట్రైలర్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్.