Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జర్నీ', 'రాజా రాణి' చిత్రాలతో జై తెలుగు ఆడియెన్స్ని ఆకట్టుకున్నారు. 'జర్నీ'లో శర్వానంద్తో, 'రాజారాణి'లో ఆర్యతో కలిసి నటించాడు కూడా. అలాగే శింబు నటించిన 'ఇదునమ్మ ఆలు', 'వాలు' చిత్రాల్లో జై అతిథిగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించబోతున్నాడు. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ సెటైర్గా 'మానాడు' చిత్రం రూపొందుతోంది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజాగా ఓ కీలక పాత్రలో జై నటించనున్నట్టు సమాచారం. శింబు, జై మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. శింబు నటించిన 'వందా రాజావాదాన్ వరువేన్' చిత్రం ఇటీవల విడుదలై నిరాశ పరిచింది. ఇది తెలుగులో వచ్చిన 'అత్తారింటికి దారేదీ'కి రీమేక్. 'పార్టీ', 'నీయా 2', 'మధురరాజా', 'కరుప్పర్ నగరమ్' చిత్రాల్లో జై నటిస్తున్నారు.