Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రధారులుగా శ్రీ వర్ధన్ దర్శకత్వంలో క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పణలో ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్న చిత్రం 'ఐఐటీ కృష్ణమూర్తి'. ఈ చిత్ర ఫస్ట్లుక్ని సోమవారం విడుదల చేశారు. 'కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్గా సినిమాని రూపొందిస్తున్నాం. వినూత్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్లుక్లో 'మిస్సింగ్, లాస్ట్ సీన్ సాటర్డే ఈవినింగ్' అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. దీంతోపాటు ఈ పోస్టర్లో సీరియస్ లుక్లో హీరో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ని ఈ నెల 24న విడుదల చేయనున్నాం. వేసవి కానుకగా మే 28న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు. వినరు వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, సత్య ఇతర పాత్రలు పోషస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమారన్, కెమెరా: యేసు.పి, ఎడిటర్: అనిల్ కుమార్.పి.