Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన ప్రేక్షకులు ఇప్పుడు తెరపై సత్ప్రవర్తన కలిగిన కథానాయికలనే చూస్తున్నారు.
ఈ క్రమంలో రియల్ వరల్డ్ని మర్చిపోతున్నారు' అని అంటోంది తాప్సీ. ఆమె నటిస్తున్న చిత్రం
'సాండ్ కి ఆంఖ్'. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు అమితాబ్ బచ్చన్తో కలిసి 'బద్లా' చిత్రంలోనూ నటిస్తోంది. సుజరు ఘోష్ దర్శకుడు. ఇందులో అమితాబ్ లాయర్గా, తాప్సీ క్లైంట్గా నటిస్తున్నారు. దీనికి గురించి చెబుతూ, ''పింక్' తర్వాత అమితాబ్ బచ్చన్ సార్తో కలిసి నటించడం, దానికి దగ్గరగా ఉండే కథ, పాత్రలు కావడం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ సినిమాకి మెయిన్ పాయింట్ అదే అయినా ఇందులో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక 'సాండ్ కి ఆంఖ్' చిత్రం ప్రపంచంలోనే ఏజ్డ్ షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాషి జీవితం ఆధారంగా రూపొందుతుంది. ఏజ్డ్ షార్ప్ షూటర్స్ జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో మేం నటించడం చాలా లక్కీగా భావిస్తున్నా. ఇప్పుడు ఆడియెన్స్ న్యాయంగా కనిపించే హీరోయిన్లనే తెరపై చూస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం క్రేజీగా అనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ ఉత్తర్ ప్రదేశ్లో జరుగుతుంది' అని తెలిపింది. వీటితోపాటు 'మిషన్ మంగళ్', 'గేమ్ ఓవర్' చిత్రాల్లోనూ తాప్సీ నటిస్తోంది.