Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతేడాది మూడు సినిమాలతో అలరించిన సోనాక్షి సిన్హా ఈ ఏడాది దాదాపు ఐదు చిత్రాలతో
ప్రేక్షకుల్ని అలరించేందుకు రాబోతోంది. ప్రస్తుతం 'కళంక్', 'మిషన్ మంగళ్', శిల్పా దాసగుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తుంది. అలాగే 'టోటల్ ధమాల్' కోసం ఓ ప్రత్యేక పాటలోనూ మెరవనుంది. దీంతోపాటు త్వరలో 'దబాంగ్ 3' ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోబోతంది. నవాజుద్దీన్ సోదరుడు నవాబ్ సిద్ధిఖీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. ఆమె పలు ప్రాజెక్ట్ల్లో బిజీగా ఉండటం, ఈ పాత్రకి సోనాక్షి అయితే బాగా సూట్ అవుతుందని దర్శకుడు కూడా భావించడంతో శ్రద్ధా స్థానంలో సోనాక్షిని ఎంపిక చేశారు. అలాగే ఈ చిత్రానికి 'బోలే చుడియా' అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. ఇలా వరుస బంపర్ ఆఫర్స్తో సోనాక్షి ఈ ఏడాదంతా సందడి చేయబోతోంది.