Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా, నందితా శ్వేత కీలక పాత్రధారిణిగా హరికిషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్ 2'. గతంలో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్'కిది సీక్వెల్. ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్రెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, 'విజయవంతమైన సినిమా 'ప్రేమ కథా చిత్రమ్'కిది సీక్వెల్ కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొంది. మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు రావు రమేష్ ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
ఆయన వాయిస్ ఓవర్తో ప్రేక్షకులు కథలోకి లీనమవుతారు.
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జోడీ, నందితా శ్వేత నటన, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్గా ఉంటుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
మార్చి 21న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. పూర్తి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సి రాంప్రసాద్, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి, సంగీతం: జె.బి.