Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు సినీ తారలు, క్రీడాకారులతోపాటు ఎంతో మంది ప్రముఖులు తమ వంతుసాయం ప్రకటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అక్షరు కుమార్ భారీ విరాళం ప్రకటించారు. 'పుల్వామ వంటి ఘటనలు మనం మర్చిపోలేం మనందరం ప్రస్తుతం కోపంతో ఊగిపోతూ ఉన్నాం. స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందిద్దాం రండి. అమర జవానుల కుటుంబాలకు సహాయం చేద్దాం. వారి రుణం తీర్చుకునేందుకు ఇంతకన్నా మంచి మార్గం లేదు. అయితే అధికారిక సైట్(భారత్ కే వీర్) ద్వారా విరాళాలు అందించి మద్దతు తెలపండి. నకిలీ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి' అని ట్విట్టర్ ద్వారా అక్షరు తెలిపారు. అయితే అక్షరు రూ.5కోట్లు విరాళంగా ఇచ్చినట్టు నేషనల్ మీడియా పేర్కొం