Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోరు, జీయా శర్మ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం 'ఎదురీత'. ఈ చిత్ర టీజర్ని హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో శ్రవణ్ మాట్లాడుతూ, 'అడగ్గానే టీజర్ని విడుదల చేసిన కళ్యాణ్రామ్కి థ్యాంక్స్. ఈ టైటిల్ గురించి అనుకున్నప్పుడు ఎన్టీఆర్ నటించిన 'ఎదురీత' సినిమా గురించి మానాన్న చెప్పారు. ఈ కథ గురించి ఆయనకు చెప్పా. పైన ఉన్న ఎన్టీఆర్కి చెబుతున్నా, ఈ టైటిల్కి కచ్చితంగా న్యాయం చేస్తాం. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా చిత్రమిది. నాకిద్దరు అబ్బాయిలున్నారు. వారి విషయంలో నేను రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఫీలయ్యా. కానీ ఈ సినిమా చేశాక బాధ్యతగల తండ్రి అంటే ఏంటో తెలిసింది. ఎంతగానో ప్రేమించే కొడుకుని తండ్రి మర్చిపోతే, ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో ఆసక్తికరం. నాకు బ్రేక్నిచ్చిన రాజమౌళి తర్వాత ఆ స్థాయి డెడికేషన్ ఈ దర్శకుడిలో కనిపించింది. నిర్మాత నా తండ్రి తర్వాత తండ్రిలాంటివారు. సినిమా బాగా వచ్చింది. ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'ఈ టైటిల్ నా కోసమే పుట్టినట్టనిపించింది. ఎందుకంటే నా జీవితమంతా ఎదురీతే. నిర్మాతని కాకముందు సినిమాకి 200 రూపాయలు పెట్టి టికెట్ కొని చూడ్డమేంటనుకున్నా. నిర్మాత అయ్యాక ఆ కష్టాలేంటో తెలిసింది. ఇప్పుడు టికెట్కి రెండు వేలు పెట్టినా తక్కువే అనిపిస్తుంది. శ్రవణ్ని నమ్మి నిర్మాతగా మారాను. ఆయనకు రుణపడి ఉంటా' అని నిర్మాత లక్ష్మీ నారాయణ చెప్పారు. దర్శకుడు చెబుతూ, 'నేను ఏది అడిగినా ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన నిర్మాతకి, నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చిన శ్రవణ్కి థ్యాంక్స్. శ్రవణ్ ఈ సినిమాతో అందరికి నచ్చుతారు. ఇది మంచి సినిమా అవుతుంది' అని తెలిపారు. 'సినిమా కోసం ప్రతి ఒక్కరు హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు. ఈ సినిమా నాకు ప్రత్యేకం అవుతుంది' అని లియోనా లిషోరు చెప్పారు. జియా శర్మ, శాన్వీ మేఘన, భద్రమ్, ఫైట్ మాస్టర్ రామకృష్ణ, కెమెరామెన్ విజరు, ఎడిటర్ నగూరన్, రైటర్ ధనేష్, మాస్టర్ చరణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.