Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు, అట్లీ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతున్న విషయం విదితమే. గతంలో వీరి కాంబినేషన్లో 'థెరి', 'మెర్సల్' వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. తాజా సినిమా చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నయన తార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం విజరు మార్క్ మాస్ ఎలిమెంట్స్, వినోదంతోపాటు అంతర్లీనంగా మంచి సందేశంతో రూపొందుతుందట. ఇందులో విజరు యంగ్ లుక్లో స్టయిలిష్గా కనిపించనున్నారట. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా చాలా ఎనర్జిటిక్గా విజరు పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఏజీఎస్ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి సేల్ అయ్యాయి. అన్ని భాషలకు సన్ టీవీ ఏకంగా రూ.60 కోట్లకు దక్కించుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.