Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 'ఆర్ ఆర్ ఆర్'తో పాటు వెంకటేష్, నాగచైతన్య కలిసి 'వెంకీమామ'లో నటిస్తున్నారు. త్వరలో మరో క్రేజీ మల్టీస్టారర్ సెట్ కాబోతుంది. మల్టీస్టారర్ ట్రెండ్ని సృష్టించిన వెంకటేష్, రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. వీరి కాంబినేషన్లో ఓ సినిమాని రూపొందించడానికి దర్శకుడు వీరు పోట్ల ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో 'బిందాస్', 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రాలకు వీరుపోట్ల దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్కి వెంకటేష్ గ్రీన్ సిగల్ ఇచ్చారని, రవితేజతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉండే ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల 'ఎఫ్ 2'లో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం 'వెంకీమామ'లో నటిస్తుండగా, రవితేజ 'డిస్కోరాజా'లో నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. దీంతోపాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. దీనికి కథానాయికగా కేథరిన్ ఎంపికయ్యారు.