Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేవదాస్' తర్వాత నాగార్జున మరే తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. తన కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోయిన 'మన్మథుడు'కి సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యారు. హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా ? అని నాగ్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ అంటూ వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ నెలలోనే సినిమా ప్రారంభం కానుందట. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఏప్రిల్ 4 వరకు మొదటి షెడ్యూల్ని హైదరాబాద్లోనే జరుపనున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ ఏప్రిల్ 12 నుంచి పోర్చుగల్లో మేజర్ షెడ్యూల్ని ప్లాన్ చేశారట. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించే ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్పూత్ కథానాయికలుగా నటించబోతున్నారు.