Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనాక్షి సిన్హా మరో భిన్నమైన సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. అజయ్ దేవగన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. గతంలో ఈ ఇద్దరు కలిసి 'సన్ ఆఫ్ సర్ధార్', 'యాక్షన్ జాక్సన్' చిత్రాల్లో నటించిన విషయం విదితమే. ముచ్చటగా మూడోసారి కలిసి తెరని పంచుకోబోతున్నారు. అజయ్ దేవగన్ తాజాగా ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విజరు కర్నిక్ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చారు. దీనికి అభిషేక్ డుదైయా దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ కర్నిక్గా అజయ్ దేవగన్ నటించనున్నారు. ఆయన సరనస సోనాక్షి కనిపించనున్నారట. వీరితోపాటు పరిణీతి చోప్రా, సంజయ్ దత్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తుంది. తాజాగా తెలుగు నటుడు రానా కూడా కీలక పాత్ర కోసం ఎంపికయ్యారట. ఆయన ఇందులో కల్నల్గా కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం సోనాక్షి 'కళంక్','మిషన్ మంగళ్' చిత్రాల్లో నటిస్తుంది. 'కళంక్'లో సత్య చౌదరీగా, 'మిషన్ మంగళ్'లో వ్యోమగామిగా కనువిందు చేయనుంది. దీంతోపాటు త్వరలో ప్రారంభం కానున్న 'దబాంగ్ 3'కోసం సిద్ధమవుతుంది. 'దబాంగ్', 'దబాంగ్2' తర్వాత వస్తున్న చిత్రమిది.