Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి హీరోహీరోయిన్లుగా హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో 'నువ్వు తోపురా' చిత్రం రూపొందుతుంది. బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిల్మ్స్ పతాకంపై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ సహకారంతో డి. శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ, 'మా చిత్రం గీతా ఆర్ట్స్, జీ3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. అందుకు అల్లు అరవింద్, బన్నివాసులకి కృతజ్ఞతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 26న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. 'మంచి నిర్మాణ విలువలతో అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశమైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది' అని సహ నిర్మాత డా||జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. దర్శకుడు చెబుతూ, 'మాస్, థ్రిల్లర్గా తెరకెక్కించాం. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. నిరోషా, రవివర్మ, శ్రీధరన్, జెమినీ సురేష్, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.