Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిలీప్ కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'దిక్సూచి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని 'దిక్సూచి మ్యూజిక్' అనే యాప్ ద్వారా బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ,'1970 బ్యాక్డ్రాప్లో సెమీ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతోపాటు అన్ని రకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. రెండు గంటలు ఆడియెన్స్ని తప్పకుండా ఆనందింప చేస్తుంది. ఈ పాటలు బాగా రావడంతో మేమే సొంతంగా రిలీజ్ చేయాలని 'దిక్సూచి మ్యూజిక్' అనే యాప్ని క్రియేట్ చేసి ఆడియోని విడుదల చేశాం. ఈ యాప్ ద్వారా భవిష్యత్లో మరిన్ని పాటలని రిలీజ్ చేయనున్నాం. విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన లభించింది. ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రైలర్ గురించే మాట్లాడుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లినా అక్కడి వారు ప్రశంసించారు. త్వరలో రైన్ బో కార్పెట్ పేరుతో చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం. ఈ ఈవెంట్కి కామన్ ఆడియెన్స్ వచ్చి సినిమా చూసి, ఎలా ఉందో టీవీలో చెబుతారు. ఇలా చేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ మూడో వారంలో సినిమాని విడుదల చేయనున్నాం. ఉగాది రోజు ఇదే బ్యానర్లో మరో సినిమా ప్రారంభిస్తున్నాం. మరోసారి ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు. 'కంటెంట్ ప్రధానంగా రూపొందించిన చిత్రమిది. ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవు. ఇలాంటి మంచి సినిమా జనాలకు చేరాలి. తప్పకుండా అందరికి నచ్చే చిత్రమవుతుంది' అని నిర్మాత నరసింహరాజు రాచూరి చెప్పారు. నటుడు అరుణ్ చెబుతూ, 'కథా బలమున్న చిత్రమిది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి' అని చెప్పారు.