Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ నా సినిమా విడుదలవుతుందంటే భయంగా ఉంటుంది. ఆ భయం మూడు రోజులుంటుంది. ఆ తర్వాత మామూలు మనిషిని అవుతాను' అని అంటున్నారు అక్షరు కుమార్. బాలీవుడ్లో భిన్నమైనా, ప్రయోగాత్మక చిత్రాలకు అక్షరు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం 'కేసరి' చిత్రంలో నటించారు. నేడు(గురువారం) ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'సినిమా కోసం నన్ను ఎంచుకునే ముందు ఈ పాత్రకు అక్షరు బాగా సూట్ అవుతాడు అని దర్శకులు నన్ను నమ్మడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాను. ఒకప్పుడు యాక్షన్ సినిమాలు మాత్రమే నా వద్దకు వచ్చాయి. భిన్నమైన సినిమాలు చేయాలనే కసి ఇప్పుడు అలాంటి కథలు నా వద్దకు రావడానికి కారణమైంది. ఇప్పుడు నాకు యాభై ఏండ్లు. ఎప్పటి వరకు నటిస్తానో తెలియదు. మహా అయితే ఓ ఐదేండ్లు యాక్షన్ సినిమాలు చేస్తా. ఆ తర్వాత మానేస్తా. అప్పటి వరకు సాధ్యమైనన్ని ఎక్కువ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను చేసే ప్రతి సినిమాని కేవలం సినిమాగానే చూడను. ఆ సినిమా ద్వారా నేర్చుకున్న, తెలుసుకున్న అంశాలను పది మందికి చెప్పే ఏ అవకాశం వచ్చినా వదులుకోను. నా వల్ల కొంత మంది మారినా హ్యాపీనే. గతంలో చేసిన 'టారులెట్ ఏక్ ప్రేమ్ కథ' సామాజిక వేత్త అరుణాచలమ్ మురుగనాథమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించాం. అప్పటికీ ఆయనెవరో నాకూ తెలియదు. ఆ తర్వాత సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'కేసరి' సారాగర్హి ప్రాంతంలో సిక్కులకు, అఫ్గానీయులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో రూపొందించాం. ట్రైలర్ చూశాక సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కచ్చితంగా ఇది అందరికి నచ్చుతుంది. ప్రేక్షకులు ఎప్పుడూ మార్పుని కోరుకుంటారు. ఆ మార్పు దిశగా మనం అడుగులు వేయాలి. అలాంటి భిన్నమైన సినిమాలు చేయాలి. నేను అది ఫాలో అవుతున్నాను కాబట్టే ఆడియెన్స్ నన్ను ఆదరిస్తున్నారు' అని అన్నారు. ప్రస్తుతం అక్షరు 'మిషన్ మంగళ్', 'గుడ్ న్యూస్', 'హౌస్ఫుల్ 4', 'సూర్యవంశీ', 'క్రాక్', 'హేరా ఫేరి 3' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.