Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు పేరు, ప్రఖ్యాతల కంటే సినిమానే ముఖ్యం' అని అంటోంది జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. గతేడాది 'దఢక్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాల్లో భాగమవుతుంది. ఈ సందర్భంగా ఓ అవార్డ్ ఫంక్షన్లో సినిమా, ఇమేజ్ గురించి ఆమె మాట్లాడుతూ, 'ప్రతి ఒక్క నటీనటులకు విజయంతోపాటు కీర్తి ముఖ్యమే. వాటి కోసమే ఎంతో శ్రమిస్తారు. కానీ నాకు ఆ అవసరం లేదు. మా ఫ్యామిలీ పెద్దది కావడంతో ఆ ఫేమ్ని నేను చిన్నప్పుడే పొందా. నా మొదటి సినిమా తర్వాత నాకు గుర్తింపు మరింతగా పెరిగింది. ఆడియెన్స్, మీడియా నన్ను సపోర్ట్ చేసిన తీరుకి కృతజ్ఞురాలునై ఉంటాను. ఇప్పుడు నాకు పేరు కంటే మంచి సినిమాల్లో భాగం కావడమే ముఖ్యం. ప్రస్తుతం అలాంటి నవ్యమైన చిత్రాల్లో నటిస్తున్నా' అని తెలిపింది. జాన్వీ ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేడీ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో గుంజన్ పాత్రలో నటిస్తుంది. దీంతోపాటు 'తఖ్త్'లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది త్వరలో ప్రారంభం కానుంది.