Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బసవ శంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రే, గార్గేయి యల్లా ప్రగడ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎవరికీ చెప్పొద్దు'. క్రేజీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ వర్రీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ని ఇటీవల హీరో శర్వానంద్ విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ, 'గతంలో రిలీజ్ అయిన టీజర్కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్కి అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుత జనరేషన్లో ఉన్న సమస్యలను వినోదాత్మకంగా దర్శకుడు చెప్పారు. సినిమా ఆద్యంతం అన్నీ వర్గాలను మెప్పిస్తుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నాం' అని అన్నారు. 'వినోదాత్మక చిత్రమిది. ఇందులో మేం చెప్పాల్సిన విషయాన్ని సునిశితంగా చెప్పాం. కచ్చితంగా ఆకట్టుకునే చిత్రమవుతుంది' అని దర్శకుడు బసవ శంకర్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ శర్మ, సినిమాటోగ్రఫీ : విజరు జె. ఆనంద్.