Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'బ్రోచేవారెవరురా' చిత్రం రూపొందుతుంది. 'చలనమే చిత్రము.. చిత్రమే చలనము' అనేది ట్యాగ్లైన్. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజరు కుమార్ మన్యం నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ని హోలీ పండుగని పుస్కరించుకుని గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'విడుదలైన ఫస్ట్లుక్కి మంచి స్పందన లభిస్తుంది. హీరో శ్రీవిష్ణుతోపాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి రంగురంగుల దుస్తులు ధరించి స్కూటర్పై వస్తున్నట్టుగా ఉన్న ఫస్ట్లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు నటిస్తున్న రెండో చిత్రమిది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపింది.ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: రవితేజ గిరిజాల.