Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'మహా' పేరుతో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న హన్సిక తాజాగా మరో మహిళా ప్రధాన చిత్రంలో భాగమయ్యారు. 'పార్ట్నర్' పేరుతో రూపొందే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నారు. దీనికి మనోజ్ దామోధరన్ దర్శకుడు. సినిమా మెయిన్గా హన్సిక పాత్ర చుట్టూ తిరుగుతుందట. ఆమె కెరీర్లో నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. 'ఇందులో హన్సిక పాత్ర భిన్నంగా ఉంటుంది. ఆమె కెరీర్కిది చాలా ముఖ్యమైన సినిమా అవుతుంది. పక్కా ఎనర్జిటిక్, ఎంటర్టైనర్' అని దర్శకుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో పాండియరాజన్, యోగిబాబు, రోబో శంకర్, వీటీవీ గణేష్, జాన్ విజరు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక హన్సిక నటిస్తున్న 'మహా' చిత్రానికి యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శింబు గెస్ట్ పాత్రలో మెరవనున్నారు. ఇది ఆమెకి 50వ సినిమా కావడం విశేషం. '100', 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' చిత్రాల్లో హన్నిక నటిస్తుంది.