Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను నా ముప్పై ఏండ్ల కెరీర్లో చాలా సినిమాల్లో నటించా. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. అందుకే మళ్ళీ నటిస్తున్నా' అని అంటున్నారు మధుబాల. 'రోజా' సినిమాతో బాగా పాపులర్ అయ్యారు మధు. ఆ తర్వాత 'జెంటిల్మెన్', 'గణేష్, 'చిలక్కొట్టుడు', 'అల్లరి ప్రియుడు' వంటి చిత్రాలతో నటిగా రాణించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. రీఎంట్రీ ఇచ్చి 'సూర్య వర్సెస్ సూర్య', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తాజాగా తెలుగులో 'కిట్టి పార్టీ', తమిళంలో 'అగ్ని వర్సెస్ దేవి' చిత్రాల్లో నటిస్తున్నారు. 'అగ్ని వర్సెస్ దేవి' నేడు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మధు మాట్లాడుతూ, 'నా కెరీర్లో ఎక్కువ శాతం మంచి పాత్రలే పోషించా. కానీ ఏ సినిమాకి అవార్డు రాలేదు. అది నన్ను కలచివేసింది. అందుకే మళ్ళీ నటనని మొదలు పెట్టాను. కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ నాకు నటన పట్ల ఉన్న ఆసక్తి మళ్ళీ సినిమాల్లో నటించేలా చేసింది. నా ప్రతిభకు ఒక్క అవార్డు వచ్చినా సంతోషిస్తాను' అని తెలిపారు. 'అగ్ని వర్సెస్ దేవి'లో మధు రాజకీయ నాయకురాలిగా శక్తివంతమైన పాత్రలో నటించారు.