Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ లగడపాటి విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతూ 'ఎవడు తక్కువ కాదు' చిత్రంలో నటిస్తున్నారు. 'ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్' అనేది ట్యాగ్లైన్. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు జయ దర్శకత్వం వహిస్తున్నారు. హోలీ పండుగని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటన ప్రేక్షకులని కట్టిపడేసింది. అంతకు ముందు బన్నీ నటించిన 'రేసుగుర్రం'లో చిన్నప్పటి పాత్రలో విక్రమ్ నటించి మెప్పించాడు. ఇప్పుడు సహిదేవ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించడం హ్యాపీగా ఉంది. ఫస్ట్లుక్లో సహిదేవ్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాడు. 'ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్..' అనేది హీరో పాత్రకి యాప్ట్గా నిలుస్తుంది. న్యూ ఏజ్ రివేంజ్ డ్రామా చిత్రమిది. బాల నటుడిగా ఆకట్టుకున్న విక్రమ్ ఇందులో కథకు తగ్గట్టుగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్తోపాటు అందమైన టీనేజ్ ప్రేమ కథతో రూపొందిస్తున్నాం. సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడుతున్నాడు. చిత్రీకరణ పూర్తయ్యింది. దర్శకుడు రఘు చాలా బాగా తెరకెక్కించారు. మా సంస్థలో ఇది మరో మంచి సినిమా అవుతుంది. విక్రమ్కి మంచి పేరును తెచ్చే చిత్రమవుతుంది' అని చెప్పారు.