Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్ ఎక్స్ 100'తో పాయల్ రాజ్పుత్ తెలుగు ఆడియెన్స్ని ఫిదా చేసింది. ఈ చిత్ర విజయంతో క్రేజీ కథానాయికగా మారింది. ప్రస్తుతం ఆమె తొలిసారి ప్రత్యేక గీతంలో మెరవబోతుంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'సీత'లో స్పెషల్ నెంబర్లో మెస్మరైజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తేజ తెలిపారు. అంతేకాదు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. 'తెలుగులో ప్రతిభ గల కథానాయికల్లో పాయల్ ఒకరు. ఆమె అందంతో ఈ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. పాట కోసం తను ఎంతో కష్టపడుతున్నారు. చాలా ప్రొషెషనల్గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రత్యేక పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ఉన్నప్పటికీ అందరి ఫోకస్ పాయల్పైనే ఉంటుంది. అంతలా ఆకట్టుకుంటుదని నమ్ముతున్నాం. ఈ పాట ఈ ఏడాదిలోనే ది బెస్ట్ సాంగ్ అవుతుంది. సినిమాకి ఈ పాటే కీలకం' అని తేజ అన్నారు. తేజ ప్రశంసలకు పాయల్ స్పందించింది. 'మీ మాటలు నాకు చాలా ఎక్కువ. థ్యాంక్స్ సర్. నా మొదటి డాన్స్ నెంబర్ త్వరలో రాబోతుంది' అని పాయల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 'మన్మథుడు 2'తోపాటు 'డిస్కోరాజా', భాను శంకర్ చిత్రం, తమిళంలో 'ఏంజెల్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.