Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరు కుమార్ బాలీవుడ్లో ఓ మినీ ఇండిస్టీ. ఆయన ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒక్క ఏడాదే ఆయన సినిమాలపై దాదాపు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఓ అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అక్షరు తాజా చిత్రం 'కేసరి' గురువారం విడుదలైంది. ఇది భారీ ఓపెనింగ్స్ని రాబట్టింది. తొలిరోజు రూ.22కోట్లు వసూలు చేసి ఈ ఏడాదిలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని బాలీవుడ్ విశ్లేషకులు తెలిపారు. 1897లో జరిగిన సారాగర్హి యుద్ధం నేపథ్యంలో చారిత్రాత్మకంగా దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అక్షరు సిక్కు ఆర్మీ నాయకుడు హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించారు. పరిణీతి చోప్రా ఆయనకు జోడీగా నటించారు. ఈ సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది.