Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత తరం కథానాయికలు ఇప్పుడు అమ్మలుగా మారుతున్నారు. నదియా, రమ్యకృష్ణ, ఖుష్బు ఇప్పటికే అమ్మలుగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో నాయిక టబు అమ్మగా మారబోతుంది. అల్లు అర్జున్కి మదర్గా నటించనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి 'నాన్న నేను' అనే టైటిల్ వినిపిస్తోంది. ఫాదర్ సెంటిమెంట్తోనే సినిమా సాగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇందులో అల్లు అర్జున్కి తల్లిగా టబుని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తను కూడా తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని టబు భావిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే, కేథరిన్ థ్రెస్సా కథానాయికలుగా ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే ఇది రెగ్యులర్ షూటింగ్ని జరుపుకోనుంది. టబు తెలుగులో చివరగా 'పాండురంగడు' చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన విషయం విదితమే.