Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్'లో నటిస్తున్నారు. దీంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఇదే కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై 'హీరో' పేరుతో ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీనికి తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో నటించే కథానాయిక కోసం కొన్ని రోజులుగా అన్వేషణ జరుగుతుంది. తాజాగా మలయాళ నటి మాళవిక మోహనన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకి పరిచయం కానుంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇదిలా ఉంటే విజరు దేవరకొండ అస్వస్థతకి గురయ్యారు. విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతో ఒత్తిడి గురయ్యారట. హోలీ రోజున ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు విజరు తెలిపారు. 'హోలీ బాగా జరుపుకున్నా. బుధవారం ఉదయం ఆరుగంటల వరకు షూటింగ్లోనే ఉన్నా. దీంతో నాకు జ్వరం వచ్చిందని అర్థమైంది. తొందరగా కోలుకోవాలి. కాబట్టి ముందస్తుగా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నా' అని విజరు తెలిపారు.