Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమీర్ఖాన్, శైలజ, సునీతా పాండే, అషి రారు, శ్రద్ధా శర్మ, అర్షతా మాధవ్ ప్రధాన పాత్రధారులుగా షేర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కేఎస్ 100'. చంద్రశేఖర మూవీస్ పతాకంపై వెంకట్ రామ్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత సాయివెంకట్, ప్రత్యేక అతిథి భవారి ఆడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ, 'ట్రైలర్తోనే బిజినెస్ బాగా అయ్యింది. 'ఆర్ ఎక్స్ 100'ని మించేలా సినిమా ఉంది. చాలా రిచ్గా తీశారు. యూత్కి కావాల్సిన అన్ని అంశాలున్నాయి. భారీ విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. 'సబ్జెక్ట్ నచ్చి దర్శకుడిపై నమ్మకంతో సినిమా నిర్మించా. ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత తెలిపారు.
దర్శకుడు షేర్ మాట్లాడుతూ, 'హర్రర్, సస్పెన్స్, రొమాన్స్ మేళవింపుగా సినిమాని రూపొందించాం. అమ్మాయిలపై చాలా దారుణాలు జరుగుతున్నాయి. అమ్మాయిల్ని ఇన్స్స్పైర్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో చాలా షేడ్స్ ఉంటాయి' అని చెప్పారు. 'మంచి కథని దర్శకుడు ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా తీశారు. పాటలు ఆకట్టుకుంటాయి. హీరోహీరోయిన్లు అద్బుతంగా నటించారు. కచ్చితంగా ఆడియెన్స్ ఆకట్టుకునే చిత్రమిది' అని సంగీత దర్శకుడు నవనీత్ చారి చెప్పారు. హీరో సమీర్ ఖాన్ చెబుతూ, 'ట్రైలర్ చూసి తప్పుగా అనుకుంటున్నారు. హర్రర్ కంటెంట్తోపాటు ఫ్యామిలీకి నచ్చే అంశాలుంటాయి' అని చెప్పారు. నందిని మాట్లాడుతూ, 'పోలీస్ పాత్ర పోషిస్తున్నా. బలమైన పాత్రనాది. ఇన్స్పైరింగ్గా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో అషి రారు, అర్పితా మాధవ్, శ్రద్ధా శర్మ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని కోరుకున్నారు.