Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) హీరోహీరోయిన్లుగా కె.గోవర్థన్ రావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నిన్నే చూస్తు'. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ని విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ,'ఇటీవల వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుతున్నాం. ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రం. మానవ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించాం. త్వరలోనే సెన్సార్కి వెళ్ళబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తున్నాం. ఏప్రిల్లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తాం. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. సుహాసిని, సుమన్, భాను చందర్, షయాజీ షిండే, రజిత, విద్య లతా, నిహాల్, వేణు, మహేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ ఈదర, ఎడిటింగ్: నాగిరెడ్డి వి.