Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో ఆకట్టుకున్న కైరా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్లో బిజీ కథానాయిక అయ్యింది. మొదటి సారి ఆమె ఓ ప్రత్యేక పాటలో మెరిసింది. అది కూడా ప్రతిష్టాత్మక చిత్రం 'కళంక్'లో కావడం విశేషం. 'ఫస్ట్ క్లాస్..' అంటూ సాగే స్పెషల్ సాంగ్లో వరుణ్ ధావన్తో కలిసి స్టెప్పులేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. కైరా డాన్స్, హావభావాలకు విశేష స్పందన లభిస్తుంది. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. దీనిపై కైరా స్పందిస్తూ, 'ఈ సినిమాలోని ప్రత్యేక గీతానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు' అని చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఇందులో వరుణ్ ధావన్, అలియాభట్, సోనాక్షి సిన్హా, ఆదిత్యా రారు కపూర్, మాధురీ దీక్షిత్, సంజరు దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తుండగా,
కరణ్ జోహార్, సాజిద్ నడియడ్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల ఈ సినిమాని చేయనున్నారు. కొన్ని రోజులుగా సినిమాకి సంబంధించి విడుదల చేస్తున్న పోస్టర్స్, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఇక కైరా అద్వానీ ప్రస్తుతం హిందీలో 'కబీర్ సింగ్',
'గుడ్ న్యూస్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.