Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు ఫ్యాన్స్కి త్వరలో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. వ్యక్తిగతంగా ఓ స్పెషల్ ట్రీట్తోపాటు తన సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ ఇవ్వనున్నారు. మహేష్ మైనపు ప్రతిమని హైదరాబాద్లో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవిష్కరించ నున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్కి చెందిన ప్రతినిధుల బృందం అభిమానుల కోసం సోమవారం రోజు హైదరాబాద్లోని ఏఎమ్బీ మల్టీకాంప్లెక్స్లో మైనపు ప్రతిమను ఉంచనున్నట్టు తెలిపారు. ఫ్యాన్స్తో పాటు వీక్షకులు సైతం ఈ మైనపు ప్రతిమతో సెల్ఫీలను తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం విశేషం.
అనంతరం సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నారు. ఇక ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రంలో మహేష్ నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర పాటలు విడుదల కానున్నాయి. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నారు.