Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేక్షకులతో కలిసి థియేటర్లో కూర్చుని నేను ఎంజారు చేయగలిగే సినిమాలనే ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాను' అని అంటున్నారు సమంత. ప్రస్తుతం తమిళంలో 'సూపర్ డీలక్స్'లో నటిస్తున్నారు. థ్రిల్లర్ ప్రధానంగా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో వేంబు అనే పాత్ర పోషించా. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో నటించేందుకు ఇద్దరు
అగ్ర కథానాయికలు నిరాకరించారు. ఆ తర్వాత నాకు ఆ ఛాన్స్ వచ్చింది. తొలుత నేనూ భయపడ్డాను.కానీ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. ఇప్పుడు ఆ పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు పాత్రల ఎంపికలో మార్పు కనిపిస్తుంది. లెక్కలు వేసుకుని సినిమాలు చేయడం ఎప్పుడో మానేశా.
సవాల్గా అనిపించిన పాత్రలే ఎంపిక చేసుకుంటున్నా. ఏ పాత్రకు భయపడతానో, దానికే ప్రయారిటీ ఇస్తా. అలాంటి పాత్రలే చేస్తా. ఎందుకంటే అవన్ని నాకెంతో ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇప్పుడు 'సూపర్ డీలక్స్'లో నటించిన పాత్ర కూడా అలాంటిదే' అని చెప్పారు. దీంతోపాటు ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి నటిస్తున్న 'మజిలీ' చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' చిత్రంలోనూ సమంత నటిస్తున్నారు.