Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమల అక్కినేని, వరలక్ష్మి శరత్ కుమార్, శరత్ కుమార్, నందిని, సునైనా, కిషోర్ ప్రధాన పాత్రధారులుగా పుష్ప దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన వెబ్సిరీస్ 'హై ప్రీస్టెస్'. జీ 5 యాప్లో ఇది ఈ నెల 25 నుంచి ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా శనివారం వెబ్ సిరీస్ ట్రైలర్ని విడుదల చేశారు. ట్రైలర్ని రిలీజ్ చేసిన అనంతరం అమల అక్కినేని మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. హర్రర్గా సాగుతూనే మంచి ఫన్ని పంచుతుంది. షూటింగ్ని బాగా ఎంజారు చేశాం. దీన్ని రూపొందించడానికి చాలా కష్టపడ్డాం. ఇందులో ఉండే ఆర్ట్ ఫామ్ అద్భుతంగా ఉంటుంది. కేవలం నాలుగు నెలల్లో సిరీస్ షూటింగ్ని పూర్తి చేయడం గొప్ప విషయం. ఇదొక అద్భుతమైన జర్నీ. టారాట్ రీడింగ్ అనే కాన్సెప్ట్, చిలక జోస్యం ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా అన్ని వర్గాల వారు దీన్ని ఎంజారు చేస్తారు' అని అన్నారు.
'నా హార్ట్కి చాలా దగ్గరైన కథ ఇది. కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని ఈ కథని రాశాం. ఐదేండ్ల క్రితం అమలని ఓ సారి కలిశా. ఆ తర్వాత తరచూ కలుస్తుండేవాళ్ళం. ఆ టైమ్లో ఈ కథ రాస్తున్నా. దీని గురించి చెప్పినప్పుడు తన ఆసక్తిని వెల్లడించారు. పాత్ర నచ్చి నటించారు. ఇక్కడున్న వారంతా నాకు ఏంజెల్స్. ఎంతో సపోర్ట్ చేశారు. బిజీగా ఉన్న కూడా కెమెరామెన్ సౌందర్ రాజన్ మా సిరీస్ని చిత్రీకరించారు. నిర్మాత కృష్ణ నన్ను అన్ని విధాలుగా ముందుకు నడిపించారు. జీ 5 సపోర్ట్నివ్వడం చాలా హ్యాపీగా ఉంది' అని దర్శకురాలు పుష్ప తెలిపారు. నటుడు బ్రహ్మాజీ చెబుతూ, 'మొదటి సారి వెబ్ సిరీస్లో నటిస్తున్నా. అక్కినేని ఫ్యామిలీలో అందరితోనూ కలిసి నటించా. కానీ అమలతో కుదరలేదు. ఇందులో మా కాంబినేషన్లో సీన్స్ ఉంటాయని చెప్పారు. తర్వాత లేకుండా చేశారు (నవ్వుతూ). ఈ నెల 25న నా పుట్టిన రోజు. జీ వాళ్ళు మంచి ఈ వెబ్ సిరీస్తో మంచి గిఫ్ట్ ఇస్తున్నారు' అని చెప్పారు. 'దీన్ని ఆరు భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నాం. అందుకే తెలుగుతోపాటు తమిళం, ఇతర భాషల వారిని కూడా ఎంచుకున్నాం' అని నిర్మాత కృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిని, సునైనా, కెమెరామెన్ సౌందర్ రాజన్ పాల్గొన్నారు.