Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది సేపట్లోనే ఏడు లక్షలకుపైగా అభిమానులు ఆయన్ని ఫాలో అవడం ప్రారంభించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడంతా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరగటం విశేషం.ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి చేసిన కామెంట్ మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది.
ఆయన భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడూ అనే ప్రశ్నకు స్పందిస్తూ, 'ప్రస్తుతం నేను నటిస్తున్న 'సాహో' మెయిన్గా స్క్రీన్ప్లే బేస్డ్గా సాగుతుంది. సుజిత్, అతని టీమ్ మూడేండ్లుగా దీనిపై వర్క్ చేశారు.
'బాహుబలి' తర్వాత నా నుంచి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆడియెన్స్ నన్ను యాక్షన్ సినిమాల్లో చూడాలనుకుంటున్నారు. తదుపరి చిత్రాలు కూడా యాక్షన్ ప్రధానంగానే ఉంటాయ'ని తెలిపి పరోక్షంగా యాక్షన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. హైలీ స్టయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సాహో' చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్
లవ్ స్టోరీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం విదితమే.